ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు
ABN , First Publish Date - 2022-01-23T00:46:58+05:30 IST
ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో
అనంతపురం: ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సీమలో ఉద్యోగుల ఓట్లతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఇప్పుడు ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదంటూ పోస్టులు పెట్టారు. ఫేస్బుక్లో పోస్ట్ని భవానీనగర్కి చెందిన మహమ్మద్ సైఫ్ షేర్ చేశాడు. దీంతో సైఫ్ను వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.