వైసీపీ ఎంపీలు రఘురామను చూసి నేర్చుకోవాలి: పోతిన మహేష్‌

ABN , First Publish Date - 2021-12-18T20:15:52+05:30 IST

వైసీపీ ఎంపీలపై జనసేన నేత పోతిన మహేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ఎంపీలు రఘురామను చూసి నేర్చుకోవాలి: పోతిన మహేష్‌

విజయవాడ: వైసీపీ ఎంపీలపై  జనసేన నేత పోతిన మహేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మహేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో చలికి రగ్గులు కప్పుకుని నిద్రపోవద్దు, మీ ఎంపీ రఘురామకృష్ణరాజు దగ్గరకు వెళ్తే పోరాటం ఎలా చేయాలో చెబుతారని హితవు పలికారు.  మనం ప్రజల కోసం పనిచేయాలి గానీ.. ఒకరి మెప్పు కోసం కాదని రఘురామ నుంచి గ్రహించాలన్నారు. వైసీపీ ఎంపీలు ఇకనైనా మేల్కొని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో గళం విప్పాలని పోతిన మహేష్‌ అన్నారు. 


Updated Date - 2021-12-18T20:15:52+05:30 IST