ప్రతిభాన్వేషణ కోసం.. దేశవ్యాప్తంగా ఐదు జోనల్ కమిటీలు
ABN , First Publish Date - 2020-08-04T09:11:10+05:30 IST
భారత్ను ఫుట్బాల్ పవర్ హౌస్గా తీర్చిదిద్దే దిశగాప్రతిభాన్వేషణ కోసం దేశవ్యాప్తంగా ఐదు జోన్ల
న్యూఢిల్లీ: భారత్ను ఫుట్బాల్ పవర్ హౌస్గా తీర్చిదిద్దే దిశగాప్రతిభాన్వేషణ కోసం దేశవ్యాప్తంగా ఐదు జోన్ల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ‘ఖేలో ఇండియా’ కింద ఈ టాలెంట్ హంట్ను నిర్వహించనున్నామన్నారు. త్వరలోనే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ఈస్ట్ జోనల్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు రిజిజు తెలిపారు.