బొగ్గు వల్లనే విద్యుత్ సమస్య ఏర్పడింది: బాలినేని

ABN , First Publish Date - 2021-10-16T21:58:33+05:30 IST

బొగ్గు సమస్య వలనే విద్యుత్ సమస్య ఏర్పడిందని, అన్ని రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

బొగ్గు వల్లనే విద్యుత్ సమస్య ఏర్పడింది: బాలినేని

అమరావతి: బొగ్గు కొరత వల్లే విద్యుత్ సమస్య ఏర్పడిందని, అన్ని రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. విద్యుత్ సమస్య విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాంమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని విధాలా బ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తారు. సోలార్ పవర్‌ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుందని విమర్శించారు. రెవిన్యూ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు అందరూ ఖచ్చితంగా పనిచేసి.. ప్రజల సమస్యలను పరిష్కరించాలని శ్రీనివాసరెడ్డి సూచించారు.

Updated Date - 2021-10-16T21:58:33+05:30 IST