విద్యుత్ కోతలు అవాస్తవం: సీపీడీసీఎల్ ఎస్ఈ శివప్రసాద్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-17T05:59:18+05:30 IST
విద్యుత్ కోతలు అవాస్తవం: సీపీడీసీఎల్ ఎస్ఈ శివప్రసాద్రెడ్డి
విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): దసరా తర్వాత పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ కోతలు ఉంటాయని సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తమని సీపీడీసీఎల్ ఎస్ఈ శివప్రసాద్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పట్టణాల్లో రాత్రి తొమ్మిది గంటల తర్వాత, నగరాల్లో రాత్రి 11 గంటల తర్వాత, గ్రామాల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత విద్యుత్ కోతలు ఉంటాయని అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.