పీఆర్ డిప్లొమా ఇంజనీర్ల అసోసియేషన నూతనకార్యవర్గం
ABN , First Publish Date - 2021-10-25T05:42:14+05:30 IST
జిల్లా పంచాయతీరాజ్ (పీఆర్) డిప్లొమా ఇంజనీర్ల అసోసియేషన నూతన కార్యవర్గాన్ని ఆదివారం జడ్పీ కార్యాలయ ఆవరణలోని పీఆర్ ఇంజనీర్ కార్యాలయంలో ఎన్నుకొన్నారు.
గుంటూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీరాజ్ (పీఆర్) డిప్లొమా ఇంజనీర్ల అసోసియేషన నూతన కార్యవర్గాన్ని ఆదివారం జడ్పీ కార్యాలయ ఆవరణలోని పీఆర్ ఇంజనీర్ కార్యాలయంలో ఎన్నుకొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా పిల్లి విభీషణ, ప్రధాన కార్యదర్శిగా పి.రవీంద్రారెడ్డి, ఫైనాన్స సెక్రటరీగా బి.హెచ.సాంబశివరావు, అసోసియేట్ ప్రసిడెంట్గా బి.విజయకుమారి, ఉపాధ్యక్షుడిగా పి.విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆర్.సురేంద్ర, జాయింట్ సెక్రటరీగా టి.వి.సత్యనారాయణలు ఎన్నికయ్యారు. ఏపీ పంచాయతీరాజ్ మినీస్టీరియల్ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, డిప్లొమ ఇంజనీర్ల అసోసియేషన ప్రధాన కార్యదర్శి రామరాజు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు సోమేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ప్రసాద్, బి.రత్నప్రసాద్ల ఆధ్వర్యంలో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.