పీఆర్ ఇంజనీర్ల నిరసన
ABN , First Publish Date - 2020-06-06T10:23:37+05:30 IST
సిమెంట్ రోడ్ల తనిఖీల ద్వారా పంచాయతీరాజ్ ఇంజనీర్లపై ప్రభుత్వం కక్షధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో అన్ని సర్కిల్
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): సిమెంట్ రోడ్ల తనిఖీల ద్వారా పంచాయతీరాజ్ ఇంజనీర్లపై ప్రభుత్వం కక్షధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఇంజనీర్లు నిరసన తెలియజేశారు. ప్రభుత్వం తమ డిమాండకు స్పందించకపోతే ఈ నెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీర్లు పనులు నిలిపేస్తారని జేఏసీ నేతలు వీవీఎంకే నాయుడు, సీహెచ్ హనుమంతరావు హెచ్చరించారు.