ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించండి

ABN , First Publish Date - 2022-01-27T04:27:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ బుధవారం ఈఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాల సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వ ర్యంలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు వినతిపత్రం అందజేశా రు.

ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించండి
గూడూరు: ఆందోళన చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు

వెంకటగిరి, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ బుధవారం ఈఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాల సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వ ర్యంలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు వినతిపత్రం అందజేశా రు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఉద్యోగు లు క్రాస్‌ రోడ్డులోవినతిపత్రం అందజేశారు.

గూడూరు:టవర్‌క్లాక్‌ కేంద్రం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఎంఈవో కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. నాగరాజు కుమార్‌, సుధీర్‌, శ్రావణ్‌ కుమార్‌, వేగూరు రాజేంద్రప్రసాద్‌, అట్లరవి, తనూజ్‌ తదితరులు పాల్గొన్నారు

కలువాయి:స్థానిక బస్టాండులోని అంబేద్క ర్‌ విగ్రహానికి పీఆర్సీ సాధన సమితి సభ్యులు మెమోరాండం సమర్పించారు. బి.మస్తాన్‌బాబు, ఐ.ప్రసన్నకుమార్‌, యన్‌.నాగరాజు, పెంచలరావు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

రాపూరు:కండలేరు డ్యాంలో ఏపీ ఎన్జీవో సంఘం రాపూరు నాయకులు వినతి పత్రాన్ని  అందించారు. 

కోట:ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పీఆర్‌సీ సాధన సమితి వినతిపత్రాలు అందజే సింది. సుబ్బరామయ్య, భూపతి,  ప్రసాద్‌, పోలయ్య, వైవీ రమణయ్యలు ఉన్నారు.



Updated Date - 2022-01-27T04:27:08+05:30 IST