ప్రాంగణ ఎంపికల్లో 28 మందికి ఉద్యోగాలు
ABN , First Publish Date - 2021-11-28T06:21:06+05:30 IST
ప్రాంగణ ఎంపికల్లో 28 మందికి ఉద్యోగాలు
కలవపాముల(ఉయ్యూరు), నవంబరు 27 : కలవపాముల శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కళాశాలలో టాలెంట్ ప్రో ఇండియా హెచ్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్, హ్యూండయ్ మొబిన్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో 28 మందికి ఉద్యోగాలు లభించినట్టు ప్రిన్సిపాల్ వంశీకృష్ణ తెలి పారు. ఎంపికకు 52 మంది హాజరుకాగా వారిలో ప్రతిభ కనపరచిన 28 మంది ఉద్యోగాలు పొందారు. అనంతపురం జిల్లా పెనుగొండలో కొరియన్ కంపెనీ అయిన హ్యూండయ్ మొబిన్ కార్ల విడిభాగాల తయారీ కేంద్రంగా ఉంది. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ. 1.7లక్షల వేతనంతో పాటు మెడికల్ ఇతర సదుపాయాలు కల్పిస్తూ కంపెనీ హెచ్ ఆర్ మేనేజర్ బి.ప్రసాద్ నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారిని కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విభాగ అధిపతులు జి.ఎల్.ప్రతాప్, ఎం.రమేష్, కె.సందీప్ అభినందించారు.