ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి

ABN , First Publish Date - 2022-01-24T06:34:46+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి
సమావేశంలో మాట్లాడుతున్న కామేశ్వరరావు

కంకిపాడు, జనవరి 23 : ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విఽధానాలపై ఉద్యమించాల్సిన అవసరముం దని జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గ నాయకులు పులి కామేశ్వరరావు అన్నారు. కంకిపాడులో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ముప్పా రాజా అధ్యక్ష తన ఆదివారం జరిగిన మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలం లోని వివిధ గ్రామాల్లో గ్రామ పార్టీలు ఏర్పాటు చేయాల న్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు అవసరమైన కార్యక్రమా లను రూపొందించాలని సూచించారు. మండల అధ్య క్షుడు  ముప్పా రాజా మాట్లాడుతూ జనసేన పార్టీ కంకిపాడు మండల కమిటి ఎన్నుకోవడం జరిగిందని, పూర్తి వివరాలు జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణకు అందజేయడం జరిగిందన్నారు. ఆయన ఆమోదించిన అనంతరం ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మండల స్థాయి కార్యకర్తలు బోయిన నాగరాజు, మళ్లికార్జున్‌, సుధీర్‌, సుంకర సురేష్‌, కుంటా గంగాధర్‌, మేదండ్రావు సతీష్‌, పిచుక రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:34:46+05:30 IST