ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-06-22T03:44:59+05:30 IST

పన్నులు, ధరల భారం మోపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీవీ రమణయ్య విమర్శించారు.

ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు
మున్సిఫల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం(ఎంఎల్‌) నాయకులు

వెంకటగిరి(టౌన్‌), జూన్‌ 21: పన్నులు, ధరల భారం మోపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీవీ రమణయ్య విమర్శించారు. సోమవారం స్థానిక మున్సిఫల్‌ కార్యాలయం వద్ద సీపీఎం(ఎంఎల్‌) నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధరల పెరుగుదల, పన్నుభారం అంశాలపై ప్రసంగించారు.  స్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె. అజిత, సీహెచ్‌ చిన ఓబయ్య, చెంజి తారక రామయ్య, డి. భాస్కర్‌, ఎన్‌వైఎస్‌ నాయకులు పీ. రాఘవ, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T03:44:59+05:30 IST