ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు
ABN , First Publish Date - 2021-06-22T03:44:59+05:30 IST
పన్నులు, ధరల భారం మోపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీవీ రమణయ్య విమర్శించారు.
వెంకటగిరి(టౌన్), జూన్ 21: పన్నులు, ధరల భారం మోపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీవీ రమణయ్య విమర్శించారు. సోమవారం స్థానిక మున్సిఫల్ కార్యాలయం వద్ద సీపీఎం(ఎంఎల్) నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధరల పెరుగుదల, పన్నుభారం అంశాలపై ప్రసంగించారు. స్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె. అజిత, సీహెచ్ చిన ఓబయ్య, చెంజి తారక రామయ్య, డి. భాస్కర్, ఎన్వైఎస్ నాయకులు పీ. రాఘవ, కార్యకర్తలు పాల్గొన్నారు.