ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-08-02T06:22:53+05:30 IST
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 1: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 44 ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను క్షుణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్ అర్జీలను మిషన్ మోడ్లో పరిష్కరించాలన్నారు. వేములవాడ ఆర్డీవో లీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేసిన గ్రామాలతో సిరిసిల్ల అర్బన్ మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు వినతి పత్రాన్ని అందించారు. పెద్దూర్ సింగిల్ విండో డైరెక్టర్ సలేంద్రీ బాలరాజుయాదవ్, కాంగ్రెస్ జిల్లా అర్గనైజింగ్ కార్యదర్శి గంభీరావుపేట ప్రశాంత్గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మంగ కిరణ్కుమార్, వంగ మల్లేశం, బీజేపీ నాయకులు బూర విష్ణువర్ధన్, అదిపెల్లి శ్రీనివాస్గౌడ్, జేట్టిరమేష్, వంగ అనిల్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.