శానిటైజర్ ఘటనలో నిందితులను అరెస్ట్ చేయనున్న సిట్
ABN , First Publish Date - 2020-08-11T13:07:34+05:30 IST
ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్ ఘటనలో 16 మంది మృతికి కారణమైన నిందితులను సిట్ అరెస్ట్ చేయనుంది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్ ఘటనలో 16 మంది మృతికి కారణమైన నిందితులను సిట్ అరెస్ట్ చేయనుంది. హైదరాబాద్కు చెందిన నిర్వాహకుడు శ్రీనివాస్తో పాటు మరో నలుగురు నిందితులను ఈరోజు సిట్ అదుపులోకి తీసుకోనుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మధ్యాహ్నం మీడియాకు వెల్లడించనున్నారు. అనంతరం నిందితులను సిట్ కోర్టులో ప్రవేశపెట్టనుంది.