ప్రకాశం జిల్లాలో 40 వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-19T12:17:49+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 40వేలు దాటాయి. తాజాగా మరో 658 కేసులు నమోదు అయ్యాయి.

ప్రకాశం జిల్లాలో 40 వేలు దాటిన కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 40వేలు దాటాయి. తాజాగా మరో 658 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,448కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 162 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 411 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 82 మంది డిశ్చార్జ్ అయ్యారు. 57 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,693 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-09-19T12:17:49+05:30 IST