ప్రియుడు మోసం చేశాడంటూ యువతి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-09-25T18:08:43+05:30 IST

ప్రకాశం జిల్లా కంభంలో యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది.

ప్రియుడు మోసం చేశాడంటూ యువతి ఆత్మహత్యాయత్నం

ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభంలో యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది.  తనను మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి బాధిత యువతి కరుణ ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో అందరూ చూస్తుండగా పురుగు మందు తాగి కరుణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మార్కాపురంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-25T18:08:43+05:30 IST