ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-09-26T12:31:06+05:30 IST
ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 676 కేసులు నమోదు అయ్యాయి.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 676 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,119కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 63 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఏడుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 445 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 89 మంది డిశ్చార్జ్ అయ్యారు. 35 మందిని హోం ఐసోలేషన్కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్లలో ప్రస్తుతం 10,564 యాక్టివ్ కేసులు ఉన్నాయి.