ప్రకాశం జిల్లాలో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-10-28T12:12:38+05:30 IST
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏసుగుండ్లపాడులో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏసుగుండ్లపాడులో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఏడు సవర్ల బంగారంతో పాటు రూ.50 వేల నగదు అపహరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.