AP: లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఆడియో వైరల్
ABN , First Publish Date - 2021-10-30T14:31:08+05:30 IST
డబ్బుల ఇస్తేనే పని చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒంగోలు: డబ్బులు ఇస్తేనే పని చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంటలో తన భూమి మ్యుటేషన్ కోసం అంజలి అనే మహిళ దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహరాన్ని గత ఆరు నెలలుగా గోనుగుంట వీఆర్వో శ్రీనివాసరావు పెండింగ్లో ఉంచారు. రూ.5 వేలు లంచం ఇస్తేనే పని పూర్తిచేస్తానని వీఆర్వో డిమాండ్ చేశాడు. మూడు వేలు ఇస్తానన్న వీఆర్వో ఒప్పుకోని పరిస్థితి. చీమకుర్తిలో ఇంతే.. లేకుంటే ఇక అంతే అంటూ డబ్బులు డిమాండ్ చేశారు. ఆన్లైన్ బేరం ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆడియోపై స్పందించి ఉన్నతాధికారులు... విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు.