AP: ప్రకాశం బ్యారేజ్కు పెరిగిన వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-09-07T16:10:04+05:30 IST
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి అధికంగా ఉంది.
విజయవాడ: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి అధికంగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగంలో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని రామిలేరు, తమిలేరు, వైరా, కీసర మునేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 65 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 57 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు సాగు, త్రాగు నీటి అవసరాల కోసం 8 వేల క్కుసేకుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.