ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి

ABN , First Publish Date - 2020-08-12T12:28:18+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 476 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 476 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,489కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 124 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అత్యధికంగా నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 137కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం  1,77,481  శ్యాంపిళ్లు పంపగా... అందులో 1,65,785 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 2238 రిపోర్టులు రావాల్సి ఉంది. నిన్న కరోనా నుండి కోలుకుని 60 మంది డిశ్చార్జ్ అయ్యారు. 10 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ప్రస్తుతం  1545 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-08-12T12:28:18+05:30 IST