మద్యం మత్తులో భార్య, కొడుకులపై కత్తితో దాడి చేసిన భర్త
ABN , First Publish Date - 2021-08-16T18:01:20+05:30 IST
దానకొండ మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. పీకల్లోతు మద్యం తాగిన తండ్రి భార్య, ఇద్దరు కొడుకులపై కోడి కత్తితో దాడి చేశాడు
ప్రకాశం: దానకొండ మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. పీకల్లోతు మద్యం తాగి ఇంటికి వచ్చిన తండ్రి..భార్య, కొడుకులతో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులోనే..భార్య, ఇద్దరు కొడుకులపై కోడి కత్తితో దాడి చేశాడు. భర్త దాడిలో భార్య, కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.