రైతుల మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-11-07T15:17:28+05:30 IST

ప్రకాశం జిల్లా: రాజధాని రైతుల మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆంక్షలు విధించారు.

రైతుల మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆంక్షలు

ప్రకాశం జిల్లా: రాజధాని రైతుల మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. పర్చూరులో కొల్లా వెంకట నారాయణ కళ్యాణ మండపం దగ్గర పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద్ర, చీరాల డీఎస్పీ శ్రీకాంత్, చీరాల రూరల్ సీఐ రోశయ్య తదితరులు వచ్చారు. పాదయాత్రలో అనుసరించాల్సిన 20 నియమాలను సీఐ రోశయ్య చదివి వినిపించారు. కాగా కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. మీడియా హాల్టింగ్ ప్రదేశాల్లో మాత్రమే కార్యక్రమాన్ని కవర్ చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే హైకోర్టుకు నివేదిస్తామని, పాదయాత్రను నిలిపివేస్తామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-11-07T15:17:28+05:30 IST