భార్యాభర్తలను గొంతు కోసి హతమార్చిన దుండగులు
ABN , First Publish Date - 2021-11-21T00:16:08+05:30 IST
జిల్లాలోని ఇంకొల్లు మండలం పూసపాడులో దారుణఘటన చోటుచేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలను గొంతు కోసి హతమార్చారు.
ప్రకాశం: జిల్లాలోని ఇంకొల్లు మండలం పూసపాడులో దారుణఘటన చోటుచేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలను గొంతు కోసి హతమార్చారు. మృతులు హనుమంతరావు (55), రామతులసమ్మ (50)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.