ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-08-30T11:54:57+05:30 IST

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై చనిపోయిన గేదెను ఢీకొని ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై చనిపోయిన గేదెను ఢీకొని ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ఏరియా ఆస్పత్రికి క్షతగాత్రులు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తుర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శారమ్మ, మార్తమ్మ, లింగమ్మ, వెంకటేష్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-08-30T11:54:57+05:30 IST