ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-09-29T15:00:32+05:30 IST

ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రసవ వేదనతో వచ్చిన మహిళకు వైద్యం అందించకుండా వైద్య సిబ్బంది ఇబ్బందులకు గురిచేసింది. తమ వద్ద ఎటువంటి సదుపాయాలు లేవని మరో చోటికి వెళ్లాలంటూ ఉచిత సలహాలు అందించారు. గర్భిణీ స్త్రీ ప్రసవవేదన చూసిన కుటుంబసభ్యుల వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-09-29T15:00:32+05:30 IST