Prakasam: అదుపు తప్పి కారు బోల్తా..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-10-09T16:27:18+05:30 IST

కనిగిరి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో

Prakasam: అదుపు తప్పి కారు బోల్తా..ఇద్దరు మృతి

ప్రకాశం: కనిగిరి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నారపురెడ్డిపల్లి దగ్గర చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కనిగిరి నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తుండగా జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-10-09T16:27:18+05:30 IST