ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుడు రమణారెడ్డికి మోహన్బాబు వార్నింగ్
ABN , First Publish Date - 2021-10-11T00:19:47+05:30 IST
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుడు రమణారెడ్డికి మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకి వెళ్లిపోవాలని ..
హైదరాబాద్: ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుడు రమణారెడ్డికి మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో రమణారెడ్డిని ఎన్నికల అధికారి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపారు. తీవ్ర ఉత్కంఠ మధ్య ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
పోలైన ఓట్లలో 50 చెల్లనివిగా ఈసీ నిర్ధారించారు. 6 టేబుల్స్పై కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్తో కలిపి 665 ఓట్లు పోల్ అయినట్లు సమాచారం. అయితే కొందరు అగ్ర హీరోలు ప్రభాస్, తారక్, మహేశ్, అల్లు అర్జున్, రామ్, నాగచైతన్య, నితిన్, వరుణ్తేజ్, అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, నవదీప్ వంటి హీరోలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయినప్పటికీ ‘మా’ చరిత్రలో రికార్డ్ స్థాయిలో ఓట్లు పోల్ అయ్యాయి.