ప్రకాశంలో కరోనా విజృంభణ..

ABN , First Publish Date - 2020-08-10T21:41:23+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బల్లికురవ మండల తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్వోలు, ఇతర సిబ్బంది మొత్తం 15 మందికి కరోనా సోకింది. వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ

ప్రకాశంలో కరోనా విజృంభణ..

ప్రకాశం : జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బల్లికురవ మండల తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్వోలు, ఇతర సిబ్బంది మొత్తం 15 మందికి కరోనా సోకింది. వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో ఆ కార్యాలయం పరిధిలో గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం గ్రామాల్లో పర్యటించే రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలకు కరోనా సోకడంతో మండల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కాగా, గతంలో ఇదే కార్యాలయంలో ఆరుగురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-08-10T21:41:23+05:30 IST