పోలీస్శాఖలో ముగ్గురికి పదోన్నతి
ABN , First Publish Date - 2021-04-21T06:11:36+05:30 IST
ఉమ్మడి జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన ముగ్గురికి పదోన్నతి లభించింది. సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ కె.సృజనకు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్పీగా సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సృజన
అడిషనల్ ఎస్పీలుగా ఏసీపీ రామేశ్వర్, మహేందర్
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/ సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 20 : ఉమ్మడి జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన ముగ్గురికి పదోన్నతి లభించింది. సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ కె.సృజనకు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ 28 నుంచి ఆమె జిల్లాలో అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్నారు. ఎస్పీగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం సృజనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా సూచించింది. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.