మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-10T19:07:11+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లినప్పుడు కోవిడ్-19 టెస్టు చేయించుకోగా తనకు పాజిటివ్ వచ్చిందని ప్రణబ్ తెలిపారు. గత వారం రోజుల నుంచి తనను కలిసినవారు సెల్ఫ్ ఐసొలేషన్ అవ్వాలని, అలాగే కోవిడ్-19 టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా బారిన పడిన ప్రణబ్ ముఖర్జీ చికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.


ఇటీవల కరోనా బారిన పడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అలాగే పలువురు బీజేపీ ఎంపీలు కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం కూడా విధితమే. 



Updated Date - 2020-08-10T19:07:11+05:30 IST