గ్రంథాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2021-12-04T05:54:06+05:30 IST
గ్రంథాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు పదోన్నతులు, భవన నిర్మాణాల కోసం స్థల సేకరణ కోసం కృషి చేస్తున్నట్లు పౌర గ్రంథాలయశాఖ సంచాలకులు డాక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు.
గుంటూరు(విద్య), డిసెంబరు 3: గ్రంథాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు పదోన్నతులు, భవన నిర్మాణాల కోసం స్థల సేకరణ కోసం కృషి చేస్తున్నట్లు పౌర గ్రంథాలయశాఖ సంచాలకులు డాక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో 13 జిల్లాల గ్రంథాలయ కార్యదర్శులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రంథాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు ప్రసన్నకుమార్ను ఘనంగా సత్కరించారు.