నందిగామ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరీ
ABN , First Publish Date - 2021-04-21T12:55:46+05:30 IST
జిల్లాలోని నందిగామ మండలం చందాపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చందాపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి హుండీ పగల
కృష్ణా: జిల్లాలోని నందిగామ మండలం చందాపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చందాపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి హుండీ పగల గొట్టి.. అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున వాచ్మన్ వచ్చే సమయానికి హుండీ పగలడంతో వాచ్మన్ వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.