నందిగామ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-04-21T12:55:46+05:30 IST

జిల్లాలోని నందిగామ మండలం చందాపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చందాపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి హుండీ పగల

నందిగామ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరీ

కృష్ణా: జిల్లాలోని నందిగామ మండలం చందాపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చందాపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి హుండీ పగల గొట్టి.. అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున వాచ్‎మన్ వచ్చే సమయానికి హుండీ పగలడంతో వాచ్‎మన్ వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. 

Updated Date - 2021-04-21T12:55:46+05:30 IST