కరోనాతో ముగ్గురు ఆర్టీసీ సిబ్బంది మరణించారు: ఎండీ ప్రతాప్

ABN , First Publish Date - 2020-07-08T21:20:52+05:30 IST

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ నివాళులర్పించారు.

కరోనాతో ముగ్గురు ఆర్టీసీ సిబ్బంది మరణించారు: ఎండీ ప్రతాప్

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ నివాళులర్పించారు. తాను వైఎస్ దగ్గర కార్యదర్శిగా పనిచేశానన్నారు. ఆయన అనేక సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ఇంకా ప్రతాప్ మాట్లాడుతూ.. కరోనాతో ముగ్గురు ఆర్టీసీ సిబ్బంది  మరణించారన్నారు. 80 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికి ఆర్టీసీ సిబ్బంది ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ కి 4,200 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ప్రతాప్ తెలిపారు. అయినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామన్నారు. 


Updated Date - 2020-07-08T21:20:52+05:30 IST