ప్రజాతీర్పు కోరే ధైర్యం వైసీపీకి ఉందా...?

ABN , First Publish Date - 2020-08-05T10:22:32+05:30 IST

రాజధాని అమరావతిపై ప్రజా తీర్పు కోరే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అంటూ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ..

ప్రజాతీర్పు కోరే ధైర్యం వైసీపీకి ఉందా...?

ప్రత్తిపాటి పుల్లారావు


గుంటూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై ప్రజా తీర్పు కోరే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అంటూ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.  మీరు తీసుకున్న నిర్ణయంపై నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్దామన్నారు. రాజధాని లేని పరిస్థితుల్లో రాష్ట్రానికి నడిబొడ్డున అన్ని జిల్లాలకు అందుబాటులో అమరావతిని ఎంపిక చేశామని తెలిపారు. అప్పుడు ఎవరు ఎందుకు వ్యతిరేకించలేదు అని నిలదీశారు. ప్రజాధనం రూ.10వేల కోట్లతో నిర్మాణాలు జరిగాయన్నారు. వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆవేదన వ్యక్త చేశారు. 

Updated Date - 2020-08-05T10:22:32+05:30 IST