లతాజీ కోలుకోవాలని ప్రార్థించండి: వైద్యులు

ABN , First Publish Date - 2022-01-15T21:57:21+05:30 IST

కోవిడ్-19, న్యుమోనియాతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న..

లతాజీ కోలుకోవాలని ప్రార్థించండి: వైద్యులు

ముంబై: కోవిడ్-19, న్యుమోనియాతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ సీనియర్ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. ఐసీయూలోనే వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగాల్సిన అవసరం ఉందని ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థించాలని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రి డాక్టర్ ప్రతిత్ సందాని కోరారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఇటీవల కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆమెకు న్యుమోనియా కూడా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.


కాగా, కోవిడ్ కేసు కావడంతో తాము దీదీని (లతా మంగేష్కర్) నేరుగా వెళ్లి చూడలేకపోతున్నామని, అయితే ఆమెకు చికిత్స అందించేందుకు తగినంత మంది వైద్యులు, నర్సులు ఉన్నారని డాక్టర్ రచనా షా తెలిపారు. వయస్సు కారణంగా ఆమెను మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచాల్సి ఉంటుందని చెప్పారు.

Updated Date - 2022-01-15T21:57:21+05:30 IST