‘పీఆర్సీని అమలు చేయాలి’
ABN , First Publish Date - 2021-04-14T06:30:52+05:30 IST
కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా 2018 జూలై నుంచి పీఆర్సీని అమలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేవీ శివయ్య డిమాండ్ చేశారు.
నంద్యాల (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 13: కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా 2018 జూలై నుంచి పీఆర్సీని అమలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేవీ శివయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నంద్యాలలోని ఏపీటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో శివయ్య మాట్లాడుతూ బకా యి పడ్డ కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయించాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, రామచంద్రారెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.