జాగ్రత్తలతో జీవనాన్ని కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-08-10T10:34:00+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించి జీవనాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

జాగ్రత్తలతో జీవనాన్ని కొనసాగించాలి

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌


జగిత్యాల ఆగస్టు 09 : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించి జీవనాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటికే తెలంగాణలో 75 వేల కేసులు నమోదయ్యాయని వివరించారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలలో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, నిరుపేదల కోసం జిల్లా లోని జేఎన్‌టీయూలో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా కరోనా టెస్టులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో నిర్వహిస్తున్నట్టు, అనుమానితులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు గట్టు సతీష్‌, బోగ ప్రవీణ్‌ కుమార్‌, సమిండ్ల శ్రీనివాస్‌, వొల్లెం మల్లేశం, అల్లె గంగా సాగర్‌, అవారి శివ కేసరిబాబు, జుంబర్తి రాజ్‌ కుమార్‌, దుమాల రాజ్‌ కుమార్‌, బొడ్ల జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:34:00+05:30 IST