కరోనా పరీక్షల కోసం గర్భిణుల నిరీక్షణ
ABN , First Publish Date - 2020-05-28T10:53:05+05:30 IST
మండుటెండ, సెగల్లో తాము కరోనా పరీక్షల కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేశా రు
కనిగిరి టౌన్, మే 27: మండుటెండ, సెగల్లో తాము కరోనా పరీక్షల కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేశా రు. గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వైద్యశాఖ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు గర్భిణులు ఎక్కువ మంది చేరుకున్నారు. వారిని కళాశాల వద్ద ఆరుబయట కూర్చోబెట్టి గంటల కొద్దీ వేచి ఉంచారు. కనీసంవారికి శానిటైజర్లు, మంచినీరు వంటి కనీస వసతులు కూడా కల్పించ లేదు. దీంతో వారు వైద్యసిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.