108లో గర్భిణి ప్రసవం
ABN , First Publish Date - 2021-06-18T05:27:11+05:30 IST
108లో గర్భిణి ప్రసవం
మేడ్చల్: నిండు గర్భిణిని 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వాహనం లో ప్రసవించింది. 108 సిబ్బంది ఈఎన్టీ దేవరాజ్, పైలట్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉండే గర్భిణి లక్ష్మి(24)ని గురువారం 108 వాహనంలో మేడ్చల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలిస్తుండగా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద లక్ష్మికి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది వాహనంలోనే కాన్పు చేశారు. లక్ష్మికి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.