ప్రియుడితో సహజీవనం.. మూడు నెలల గర్భిణి.. సడన్‌గా అదృశ్యమైన అతడిని వెతుక్కుంటూ ఊరికి వెళ్తే..

ABN , First Publish Date - 2021-07-30T20:42:16+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు.. ఒకే ఫ్లాట్‌లో సహజీవనం చేశారు.. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామనే ఉద్దేశంతో అతడిని ఆమె పూర్తిగా నమ్మింది..

ప్రియుడితో సహజీవనం.. మూడు నెలల గర్భిణి.. సడన్‌గా అదృశ్యమైన అతడిని వెతుక్కుంటూ ఊరికి వెళ్తే..

వారిద్దరూ ప్రేమికులు.. ఒకే ఫ్లాట్‌లో సహజీవనం చేశారు.. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామనే ఉద్దేశంతో అతడిని ఆమె పూర్తిగా నమ్మింది.. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.. ఈ విషయం తెలియడంతో ప్రియుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.. గర్భం తీయించుకోమన్నాడు.. ఆమె అందుకు నిరాకరించడంతో అతడు పరారయ్యాడు.. అతడి గురించి వెతుకుతూ ఆమె అతడి స్వగ్రామానికి చేరుకుని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఛప్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


యూపీకి చెందిన అషుతోష్ సింగ్ నోయిడాలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ తనకు పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. అనంతరం ఆమెతో సహజీవనం ప్రారంభించాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. అయితే అతడికి ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. దీంతో ఆమెను వదిలించుకోవాలనుకుని ఉద్యోగం వదిలేసి నోయిడా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అయిన యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. 


తన ప్రియుడిని వెతుక్కుంటూ యూపీలోని ఛప్రా జిల్లాలోని సెమ్రీ గ్రామానికి వచ్చింది. అయితే అక్కడా ఆమెకు అతడు కనబడలేదు. రెండు సంవత్సరాలుగా అషుతోష్ అక్కడకు రాలేదని తెలిసింది. దీంతో ఆమె అషుతోష్ ఆచూకి కనిపెట్టమని కోరుతూ సెమ్రీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అషుతోష్ గురించి వెతుకున్నారు. 

Updated Date - 2021-07-30T20:42:16+05:30 IST