కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టులు

ABN , First Publish Date - 2020-09-19T05:32:36+05:30 IST

ప్రగతిభవన్‌ ముట్టడికి వెళుతున్న కాంగ్రెస్‌ నాయకులను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు

కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టులు

కరీంనగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 18: ప్రగతిభవన్‌ ముట్టడికి వెళుతున్న కాంగ్రెస్‌ నాయకులను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అసెంబ్లీ సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ప్రగతిభవన్‌ ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివెళ్లే క్రమంలో పోలీ సులు ఉదయమే వారి ఇళ్లు, కార్యాలయాలకు వెళ్లి అరెస్టుచేసి పోలీసుఠాణాలకు తరలించారు. కరీంనగర్‌, హుజురాబాద్‌ డివిజన్‌ల పరిధిలోని పలు మండలాలలో కాంగ్రెస్‌ నాయ కులు, కార్యకర్తలు 98మందిని అరెస్టు చేసి మధ్యాహ్నం తరువాత వదిలిపెట్టారు. కరీంనగర్‌ పట్టణంలో టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, యువజనకాంగ్రెస్‌ నాయకులు ఇమ్రాన్‌, హరీష్‌, సతీష్‌, నగర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కుర్ర పోచన్న తదితరులను అరెస్టు చేసి మూడో ఠాణాకు తరలించారు.

Updated Date - 2020-09-19T05:32:36+05:30 IST