రూ.500 కోట్లతో ప్రీమియర్ ఎనర్జీస్ కొత్త ప్లాంట్
ABN , First Publish Date - 2021-06-22T05:34:30+05:30 IST
హైదరాబాద్కు చెందిన సోలార్ పీవీ సెల్స్, మాడ్యూల్స్ తయారీ కంపెనీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన సోలార్ పీవీ సెల్స్, మాడ్యూల్స్ తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ కొత్త ప్లాంట్లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించింది. దాదాపు రూ.500 కోట్లతో దీన్ని నిర్మించామని.. అత్యంత నాణ్యమైన సిలికాన్ వెఫర్స్తో సోలార్ సెల్స్ను ఉత్పత్తి చేయనున్నామని ప్రీమియర్ ఎనర్జీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలుజా తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని ఈ-సిటీలో 25 ఎకరాల్లో విస్తీర్ణంలో కొత్త ప్లాంట్ను కంపెనీ ఏర్పాటు చేసింది. జూలై నుంచి పూర్తి స్థాయిలో వాణిజ్యపరంగా ఉత్పత్తిని చేపట్టనుంది. మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం 1.25 గిగావాట్లు, సెల్స్ ఉత్పత్తి సామర్థ్యం 0.75 గిగావాట్లు ఉంది. కొత్త ప్లాంట్తో దేశంలోనే మాడ్యూల్స్ను, సెల్స్ను తయారు చేసే రెండో అతిపెద్ద కంపెనీగా ప్రీమియర్ ఎనర్జీస్ ఆవిర్భవిస్తుంది.