త్వరితగతిన ఇళ్ల స్థలాలను సిద్ధం చేయండి
ABN , First Publish Date - 2020-02-23T07:29:05+05:30 IST
నిరుపేదలకు ఇళ్ల స్థలాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు ఇళ్ల
ఇన్చార్జి కలెక్టర్ శ్రీనివాసులు
(కలెక్టరేట్, ఫిబ్రవరి 22)
నిరుపేదలకు ఇళ్ల స్థలాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అధికార్లు కృషి చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి స్థలాలు సేకరణ , స్థలాలు చదును చేయడం వంటి కార్యక్రమాలపై శ్రద్ధ వహించాలన్నారు. మార్చి 5 లోగా అన్ని పనులు సక్రమంగా నిర్వహించి.. స్థలాల పంపిణీకి సన్నద్ధమవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు ఎం.వి. రమణ, టివిఎస్జి. కుమార్ తదితరు అధికార్లు పాల్గొన్నారు.