రబీ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం
ABN , First Publish Date - 2021-04-21T04:59:19+05:30 IST
రబీ ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 40కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జేసీ కిషోర్కుమార్ రైతులకు పలు సూచనలు అందించారు.
23 నుంచి 40 కేంద్రాల ద్వారా సేకరణ
జేసీ కిషోర్కుమార్ వెల్లడి
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
రబీ ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 40కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జేసీ కిషోర్కుమార్ రైతులకు పలు సూచనలు అందించారు. రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం తేమను కొలిచే యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడ ధాన్యం శాంపిళ్లు చూపి ధరను నిర్ధేశించుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 624 తేమను కొలిచే యంత్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం నాణ్యతను బట్టి డబ్బులు పొందొచ్చని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న వివిధ ఏజన్సీల వద్ద కూడా తేమను కొలిచే యంత్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ద్వారా కొను గోలు చేసి మిల్లర్లకు మిల్లింగ్ కోసం పంపిస్తామన్నారు. ధాన్యం నిల్వల శాంపి ళ్లను రైతు భరోసా కేంద్రాలు లేదా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏజన్సీల ద్వారా అమ్మకాలు నిర్వహించి మద్దతు ధర పొందాలని జేసీ సూచించారు.