మూడోదశను ఎదుర్కొనేందుకు సిద్ధం!

ABN , First Publish Date - 2021-09-19T05:20:17+05:30 IST

కొవిడ్‌ మూడో దశ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు, వైద్యసిబ్బంది, మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఒకవేళ మూడోదశ వ్యాప్తి చెందితే సమర్థంగా ఎదుర్కొని.. వైరస్‌ను కట్టడి చేయాలని సూచించారు.

మూడోదశను ఎదుర్కొనేందుకు సిద్ధం!
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ శ్రీనివాసులు, ఇతర అధికారులు

 కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదదర్శి రాజీవ్‌ గౌబ

కలెక్టరేట్‌, సెప్టెంబరు 18 : కొవిడ్‌ మూడో దశ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు, వైద్యసిబ్బంది, మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు.  ఒకవేళ మూడోదశ వ్యాప్తి చెందితే సమర్థంగా ఎదుర్కొని.. వైరస్‌ను కట్టడి చేయాలని  సూచించారు. అనంతరం సంబంధిత అధికారులతో జేసీ శ్రీనివాసులు మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. డెంగ్యూ కేసు బలగ ప్రాంతంలో నమోదైందని... పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌, శ్రీకాకుళం కార్పొ రేషన్‌, రాజాం, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-19T05:20:17+05:30 IST