‘మమ్మల్ని ఆదుకోండి’

ABN , First Publish Date - 2020-05-28T09:33:56+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా వీధిన పడిన విశ్వబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని చీపురుపల్లి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణులు

‘మమ్మల్ని ఆదుకోండి’

చీపురుపల్లి, మే 27: లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా వీధిన పడిన విశ్వబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని చీపురుపల్లి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు బుధవారం ఎంపీ బెల్లానను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.  ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.  ఆ సంఘం నాయకులు పట్నాన ఈశ్వరరావు, బొద్దూరు శంకరరావు  తదితరులు పాల్గొన్నారు.  ఫ బొబ్బిలి:  లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని బొబ్బిలిలో నూతనంగా ఏర్పాటైన ‘మన కుటుంబం’ ఫ్లవర్‌ డెకరేషన్‌, లైటింగ్‌, సౌండ్స్‌ యూనియన్‌ ప్రతినిధులు   కోరారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడుకు వినతిపత్రం ఇచ్చారు.  ఆర్థికి సహాయాన్ని తమకు కూడా వర్తింపజేయాలని, పరిమిత సంఖ్యలో శుభకార్యక్రమాలకు అనుమతివ్వాలని కోరారు.  సంఘ నాయకులు  బాబు, జి.కృష్ణ, బలరాం, ఆంజనేయులు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T09:33:56+05:30 IST