‘మమ్మల్ని ఆదుకోండి’
ABN , First Publish Date - 2020-05-28T09:33:56+05:30 IST
లాక్డౌన్ కారణంగా పూర్తిగా వీధిన పడిన విశ్వబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని చీపురుపల్లి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణులు
చీపురుపల్లి, మే 27: లాక్డౌన్ కారణంగా పూర్తిగా వీధిన పడిన విశ్వబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని చీపురుపల్లి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు బుధవారం ఎంపీ బెల్లానను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఆ సంఘం నాయకులు పట్నాన ఈశ్వరరావు, బొద్దూరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ బొబ్బిలి: లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని బొబ్బిలిలో నూతనంగా ఏర్పాటైన ‘మన కుటుంబం’ ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్, సౌండ్స్ యూనియన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడుకు వినతిపత్రం ఇచ్చారు. ఆర్థికి సహాయాన్ని తమకు కూడా వర్తింపజేయాలని, పరిమిత సంఖ్యలో శుభకార్యక్రమాలకు అనుమతివ్వాలని కోరారు. సంఘ నాయకులు బాబు, జి.కృష్ణ, బలరాం, ఆంజనేయులు పాల్గొన్నారు.