7న మదనపల్లెకు రాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-01-17T06:50:06+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 7వ తేది మదనపల్లె పర్యటనకు రానున్నారని సబ్‌కలెక్టర్‌ జాహ్నవి పేర్కొన్నారు.

7న మదనపల్లెకు రాష్ట్రపతి
ముంతాజ్‌అలీతో చర్చిస్తున్న సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, ఎమ్మెల్యే

మదనపల్లె టౌన్‌, జనవరి 16: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 7వ తేది మదనపల్లె పర్యటనకు రానున్నారని సబ్‌కలెక్టర్‌ జాహ్నవి పేర్కొన్నారు. శనివారం మదనపల్లె పట్టణ శివారులోని సత్సంగ్‌ ఆశ్రమానికి సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, ఎమ్మెల్యే నవాజ్‌బాషా, డీఎస్పీ రవిమనోహరాచారి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా సత్సంగ్‌ ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ యోగా గురువు, పద్మభూషణ్‌ ముంతాజ్‌ అలీ( మిస్టర్‌ ఎం)తో సబ్‌కలెక్టర్‌ చర్చించారు. 7వ తేదిన రాష్ట్రపతి సత్సంగ్‌ ఆశ్రమానికి విచ్చేస్తారని, ఈ ఆశ్రమంలోనే 2గంటలపాటు గడుపుతారన్నారు. ఈ అశ్రమం పక్కన హెలికాప్టర్‌ దిగేందుకు అనువైన ప్రదేశం లేనందున సమీపంలోని బీటీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు అధికారులు ఉపక్రమించారు. 

Updated Date - 2021-01-17T06:50:06+05:30 IST