కొబ్బరి బొండాల వ్యాపారితో రాహుల్ ముచ్చట్లు
ABN , First Publish Date - 2021-03-01T13:13:52+05:30 IST
తిరునల్వేలిలో ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాందీ మార్గమధ్యంలో కొబ్బరి బొండాల వ్యాపారితో ముచ్చటిం చారు. రాష్ట్రంలో సుడిగాలి ప్రచారం చేపట్టిన రాహుల్ ...
చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): తిరునల్వేలిలో ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాందీ మార్గమధ్యంలో కొబ్బరి బొండాల వ్యాపారితో ముచ్చటిం చారు. రాష్ట్రంలో సుడిగాలి ప్రచారం చేపట్టిన రాహుల్ రెండవ రోజైన ఆదివారం తిరునల్వేలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిరు నల్వేలి జిల్లా పాళయంకోటలో ఉపాధ్యాయులు, అధ్యాపకులతో ముఖాముఖిలో పాల్గొన్న రాహుల్ అలంకుళంకు బయ ల్దేరారు. మార్గమధ్యంలో రాహుల్గాంధీ కారు ఆపి రోడ్డు పక్కనే ఉన్న వ్యాపారి వద్దకు వెళ్లి కొబ్బరి బొండాలు కొట్టించుకొని తాగుతూ అతనితో ముచ్చటించారు. తనతో పాటు నేతలు కూడా కొబ్బరి నీరు తాగడంతో, వ్యాపారికి రాహుల్ నగదు అందజేశారు.