ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ రూ.2,000 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-11-23T06:32:03+05:30 IST

హైదరాబాద్‌, గోవా, బెంగళూరుల్లో కొత్తగా నాలుగు హౌసింగ్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను డెవలప్‌ చేయనున్నట్లు ప్రకటించింది...

ప్రెస్టీజ్‌  ఎస్టేట్స్‌ రూ.2,000 కోట్ల పెట్టుబడులు

  • హైదరాబాద్‌ సహా బెంగళూరు, గోవాలో 4 హౌసింగ్‌ ప్రాజెక్టుల అభివృద్ధి 


న్యూఢిల్లీ: హైదరాబాద్‌, గోవా, బెంగళూరుల్లో కొత్తగా నాలుగు హౌసింగ్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను డెవలప్‌ చేయనున్నట్లు ప్రకటించింది. హైద రాబాద్‌లో ప్రెస్టీజ్‌ ట్రాంక్విల్‌ పేరుతో కంపెనీ.. మిడిల్‌ ఇన్‌కమ్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ను ఈ నెలారంభంలో ప్రారంభించింది. రూ.825 కోట్ల పెట్టుబడితో మొత్తం 8 ఎకరాల్లో 906 హౌసింగ్‌ యూనిట్లను కంపెనీ నిర్మిస్తోంది. 

Updated Date - 2020-11-23T06:32:03+05:30 IST