మోదకొండమ్మ ఆలయంలో పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-05-14T05:12:02+05:30 IST

స్థానిక మోదకొండమ్మ ఆలయంలో పోతురాజు విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నరసింగరావులు గురువారం ప్రతిష్ఠించారు.

మోదకొండమ్మ ఆలయంలో పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ
పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు.


పాడేరురూరల్‌, మే 13: స్థానిక మోదకొండమ్మ ఆలయంలో పోతురాజు విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నరసింగరావులు గురువారం ప్రతిష్ఠించారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యశర్మ ప్రత్యేక పూజలు, హోమం చేశారు. కొవిడ్‌ కారణంగా విగ్రహ ప్రతిష్ఠను నిరాడంబరంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, శివరాత్రి శ్రీనివాస్‌కుమార్‌, బీవీఎస్‌.ముకుందరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-14T05:12:02+05:30 IST